ELECTIONS: బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఖరారు

ELECTIONS: బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఖరారు

లోక్ సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌- బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను కేటాయించినట్టు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు RSప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశముంది. త్వరలోనే... ఈ అంశంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు.... పరస్పర సహకారంతో పయనిస్తాయని ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలో తమ లౌకిక కూటమి విజయం సాధిస్తుందని ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తంచేశారు. అటు...... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించడంపై... మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఇక్కడ పోటీ చేసే బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ విజయానికి... కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Next Story