విజయవాడలో మాయమైన గాంధీజీ భారీ కాంస్య విగ్రహం

విజయవాడలో మాయమైన గాంధీజీ భారీ కాంస్య విగ్రహం

విజయవాడలో మహాత్మగాంధీజీ భారీ కాంస్య విగ్రహం మాయమైంది. దీంతో వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. కాంస్య విగ్రహాన్ని కరిగించి అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంస్య విగ్రహాం మాయం వెనుక దుర్గగుడి దొంగలున్నారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయం చేసిన వారే... కాంస్య విగ్రహాన్ని మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్ళైన సందర్భంగా నగరపాలక సంస్ధ ఎదుట గాంధీ కాంస్య విగ్రహాం ఏర్పాటు చేశారు అధికారులు. అన్నాహజారే చేతుల మీదుగా 30 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ప్లైఓవర్ నిర్మాణం సందర్భంగా విగ్రహాన్ని రాజీవీ గాంధీ పార్క్‌లో భద్రపరచారు అధికారులు. ప్లైఓవర్ పూర్తైనా విగ్రహాన్ని పున:ప్రతిష్టించకపోవడంతో విగ్రహాంపై ఆరా తీయడంతో విగ్రహం మాయమైందని నిర్ధారణకొచ్చారు. ఈ విగ్రహం ఏమైందన్న ప్రశ్నకు నీళ్ళు నములుతున్నారు నగరపాలక సంస్ధ అధికారులు. విగ్రహాం ఎక్కడుందో తెలియదంటున్న అధికారులు విగ్రహాన్ని మాత్రం కరిగించలేదంటున్నారు. ఈ గాంధీ విగ్రహాన్ని అపహరించిందెవరో చెప్పాలంటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story