By - Subba Reddy |4 May 2023 6:15 AM GMT
మెదక్ జిల్లాలో ఓ సర్పంచ్ భర్త అదృశ్యం సంచలనం రేపుతోంది. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి భర్త శ్రీనివాస్ సబ్ స్టేషన్లో ఉద్యోగి. బుధవారం సబ్ స్టేషన్లోనే ఫోన్, బైక్ వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న రామయంపేట పోలీసులు.. శ్రీనివాస్ కోసం వెతుకుతున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి 40 లక్షలు ఖర్చు చేశామని ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల బాధతోనే తన భర్త అదృశ్యమయ్యారని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com