ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మెడికో సూసైడ్‌

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మెడికో సూసైడ్‌

కర్నూలు జిల్లాలో ఓ మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న లోకేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేశ్ ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చిన పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రి తరలించారు.

Next Story