విద్యుత్ ఉద్యోగులను కొట్టిన మజ్లిస్ నేత

విద్యుత్ ఉద్యోగులను కొట్టిన మజ్లిస్ నేత

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో విద్యుత్‌ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. కార్వాన్‌ నియోజకవర్గం మహబూబ్‌ కాలనీలో కరెంట్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు.. ఆ ప్రాంతంలో తనిఖీ చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులపై MIM నేత మహ్మద్‌ ఆజం, అతని కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడి విద్యుత్‌ శాఖలో చర్చనీయాంశమైంది. కరెంట్‌ చౌర్యాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన విద్యుత్‌ ఉద్యోగులపై దాడికి దిగడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story