ట్రిపుల్‌ ఐటీలో వరుస ఘటనలు బాధాకరం: మంత్రి సబిత

ట్రిపుల్‌ ఐటీలో వరుస ఘటనలు బాధాకరం: మంత్రి సబిత

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల మృతిపై మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించారు. ట్రిపుల్‌ ఐటీలో వరుస ఘటనలు బాధాకరమన్నారు. మొన్న జరిగిన ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదన్న మంత్రి పూర్తి సమాచారం వచ్చాక మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు. ఏది ఏమైనా విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు మంత్రి సబిత.

Next Story