Mint: హైదరాబాద్ మింట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు

Mint: హైదరాబాద్ మింట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్‌ జరిగిన కార్యక్రమంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ స్మారక నాణెన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మింట్‌లో తయారైన ఈ నాణెం మార్కెట్‌లో చలామణి కోసం కాదని. కేవలం స్మారక నాణెమని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు.ఈ నాణెం ధర 3 వేల 500 నుంచి 4వేల850 వరకు ధర ఉంటుందని..దీని తయారీకి కూడా అంతే ఖర్చు అవుతుందని అన్నారు. తొలి విడతలో 12వేల నాణేలు తయారు చేశామన్న ఆయన వీటి కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని అన్నారు.డిమాండ్ కి తగినంత సప్లై లేదని,అందరికీ అందేలా నాణేలు తయారు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మింట్‌లో తొలిసారి ఓ వ్యక్తి పేరు మీద నాణెం ముద్రించామని,ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయిల డినామినేషన్ తో కాయిన్ ముద్రించామని అన్నారు. ఈ కాయిన్‌ కొనుగోలు కోసం ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు నాయుడు తెలిపారు.

Next Story