YCP MP: వైసీపీ ఎంపీ నోటీ దురుసు

YCP MP: వైసీపీ ఎంపీ నోటీ దురుసు

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్‌లో మిథున్‌రెడ్డి అభ్యంతరకర ధోరణి కలకలం రేపింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడిపై మిథున్‌రెడ్డి అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఏయ్‌ కూర్చోరా అంటూ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ గురించి సోమవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడాక వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థ సీమెన్స్‌తో ఒప్పందం కుదురిందని మిథున్‌రెడ్డి చెబుతుండగా వెనుక నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు దానిని ఖండిస్తూ మాట్లాడారు. అసహనానికి గురైన మిథున్‌రెడ్డి ఏయ్ కూర్చోరా బాబు.. నువ్వు మాట్లాడినావ్‌ చాల్లే కూర్చో అంటే ఏకవచనంతో సంబోధించారు.

ప్యానెల్‌ స్పీకర్‌ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ జోక్యం చేసుకుంటూ కోర్టు పరిశీలనలో ఉన్న కేసు గురించి మాట్లాడటం మంచిది కాదన్నారు. టీడీపీ వారు ఈ అంశాన్ని లేవనెత్తడం వల్లే తాను మాట్లాడుతున్నానని మిథున్‌రెడ్డి చెప్పారు. ఆ వాదనతో ప్యానెల్‌ స్పీకర్‌ విభేదించారు. ప్రేమచంద్రన్‌ జోక్యం చేసుకుని ఈ కేసులో కోర్టును నిర్ణయం తీసుకోనివ్వండని అన్నారు. మిథున్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుంచి తొలగించారు.

Next Story