By - Vijayanand |6 Aug 2023 8:21 AM GMT
ఆర్టీసీ విలీనాన్ని రాజకీయలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ అడ్డుపడటం వల్లే ఆర్టీసీ విలీనం కావట్లేదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే.. కానీ సీఏస్ తో వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎస్ ను పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com