మహిళా రిజర్వేషన్లు వ్యక్తిగత ఎజెండా కాదు- ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్లు వ్యక్తిగత ఎజెండా కాదు- ఎమ్మెల్సీ కవిత

దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ఎమ్మెల్యీ కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని తెలిపారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Next Story