బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో పంద్రాగస్టు వేడుకలు

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో పంద్రాగస్టు వేడుకలు

దేశంలో నెలకొన్న అవినీతి, యువతలో పెరుగుతున్న అలసత్వం, మాదక ద్రవ్యాల వినియోగంపై పోరాడాలని సినీనటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఎందరో మహానుభావులు, విప్లవకారులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని బాలకృష్ణ తెలిపారు.

Next Story