ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో శిరివెళ్ల మండలంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అఖిలప్రియ.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబుపై నీచ రాజకీయాలు చేస్తూ కేసులు పెట్టే దుస్థితికి వైసీపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు.

Next Story