'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గుంటూరు, కృష్ణా, NTR జిల్లాల్లో నాలుగురోజుల పాటు పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో... మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి... ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నెల 6న మంగళగిరి, 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, 8న తాడికొండ నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగనుంది. 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.
పర్యటన వివరాలు...
6న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన.
7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన.
8న తాడికొండ నియోజకవర్గంలో పర్యటన.
9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com