జగన్ రెడ్డికి ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు- లోకేష్‌

జగన్ రెడ్డికి ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు- లోకేష్‌

జగన్ అండ్‌ కోకు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం నిధులిచ్చినా వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది అని విమర్శించారు. జల్ జీవన్ మిషన్‌ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వనికుంట గ్రామస్థులు లోకేష్ కు వినతి పత్రం అందచేశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఫ్లోరిన్ సమస్య వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.

Next Story