AP: డీఎస్సీ పేరిట వైసీపీ డ్రామాలు

AP: డీఎస్సీ పేరిట వైసీపీ డ్రామాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ నిర్ణయాలపై తెలుగుదేశం విమర్శలు గుప్పించింది. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరని తెలుగుదేశం నేత నారా లోకేశ్ విమర్శించారు. త్వరలో డ్రామాల వైసీపీ ప్రభుత్వం పోతుందన్న ఆయన యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. సౌర విద్యుత్ పేరిట జగన్ రెడ్డి 2వేల 350 కోట్లు దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. గత ప్రభుత్వాలు మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి మూడెకరాల కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 6 ఎకరాలకు పెంచిందని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి అదనంగా జరిపిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story