Yuvagalam: విధి పగబడితే లోకేష్‌ అన్న దారిచూపాడు

Yuvagalam: విధి పగబడితే లోకేష్‌ అన్న దారిచూపాడు

తాడేపల్లిలో నివాసముండే షేక్ రెహానా ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయింది. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేష్‌కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు 30వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది.

Next Story