By - Vijayanand |7 July 2023 11:08 AM GMT
వారం గడిచినా రాయలసీమలో వర్షాలు కురవడం లేదు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తొలకరికి వేసిన పంటలన్నింటినీ రైతులు దున్నేశారు. వర్షాలు కురిస్తే తప్ప ప్రత్యామ్నాయ పంటలు వేయలేమంటున్నారు. ఎకరాకు 30 నుంచి 40 వేల దాకా నష్టం జరిగిందంటున్న రైతులను ఆందోళన చెందొద్దంటున్నారు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.ఆగష్టు మొదటి వారం వరకూ పత్తి, ఆముదంతో పాటు కొర్రలు వేసుకోవచ్చని అన్నదాతలకు సూచనలు చేస్తున్నారు. పత్తి మొక్కలను బతికించుకోవాలంటే ఫార్ములా 4, ఫార్ములా 6 పిచికారి చేయాలని శాస్త్ర వేత్తలు సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com