Andhra Pradesh: టీడీపీ పోరాటం ఫలించింది: పయ్యావుల

Andhra Pradesh: టీడీపీ పోరాటం ఫలించింది: పయ్యావుల

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ బీజేపీ శ్రేణులు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం నుంచి బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. పోలీసుల కళ్లుగప్పి బయటకి వచ్చిన బీజేపీ నేతలు మంత్రి ఇంటి గేటు దూకి లోపలకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Next Story