పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో హైటెన్షన్‌

పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో హైటెన్షన్‌

కడపజిలా పులివెందుల పూల అంగళ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. సభ కోసం టీడీడీ ఏర్పాటు చేసిన మైకుల్ని పోలీసులు తొలగించారు. దాంతో ఖాకీల తీరుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సభ, రోడ్‌ షోకు అనుమతిస్తే సరేనని లేకపోయినా నిర్వహించి తీరతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు నుంచి గండికోట ప్రాజెక్ట్ సందర్శనకు బయల్దేరారు. జమ్మలమడుగు సర్కిల్‌లో మాట్లాడారు.

Next Story