Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంత‌కుడు మృతి

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంత‌కుడు  మృతి

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన శంథన్‌ కన్నుమూశాడు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శంథన్‌ అలియాస్ సుతేంద్రరాజా ఆరోగ్యం విషమించడంతో.. తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల సంథాన్‌ 1991లో రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషీగా తేలి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాలేయ వైఫల్యానికి చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున శంథన్‌కు గుండెపోటు వచ్చిందని సీపీఆర్ చేసి అతడిని బతికించామని రాజీవ్‌గాంధీ ఆస్పత్రి డీన్ తెరనిరాజన్ తెలిపారు. తర్వాత అతడిని వెంటిలేటర్‌పై ఉంచామని.... చికిత్సకు అతడి శరీరం స్పందించలేదని వివరించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో శంథన్‌ తుది శ్వాస విడిచినట్లు తెరనిరాజన్‌ వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్‌కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల అయ్యాడు.

Next Story