REVANTH: కరెంట్‌ కట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తా: రేవంత్‌రెడ్డి

REVANTH: కరెంట్‌ కట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తా: రేవంత్‌రెడ్డి

సరైన కారణంగా లేకుండా కరెంటు కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం... కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ త ప్రభుత్వ హ యాంలో నియ మితులైన కొంద రు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోత విధిస్తున్నారనే సమచారం.. ఉందని సీఎం తెలిపారు. గ తేడాదితో పోల్చితే గత రెండు నెల ల్లో విద్యుత్ స ర ఫ రా ఎక్కువ గా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ వివరించారు. ఇటీవ ల మూడు సబ్ స్టేషన్ల ప రిధిలో లోడ్ హెచ్చుతగ్గులను గమనించనందున కొంతసేపు విద్యుత్ స ర ఫ రాకు అంత రాయం క లిగింద ని చెప్పారు. మరోవైపు తాగునీటి సరఫరాపై సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 టీఎంసీలు తీసుకుంటోందని, ఏపీలో ఎక్కడ వాడుతున్నారో లెక్కలు తీసుకోవాలన్నారు. తాగునీటి పేరిట ఇతర అవసరాలకు తీసుకెళ్లకుండా చూడాలన్నారు. సమగ్రంగా సమీక్షించి కేఆర్ఎంబీకి లేఖ రాయాలన్నారు. జీహెచ్ ఎంసీలో తాగునీటికి సమస్య రాకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Next Story