By - Vijayanand |10 Aug 2023 6:31 AM GMT
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలహర్వి మండలం చింతకుంటలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగార్తులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా... కర్ణాటకలోని శిడిగమనలకు చెందిన వారిగా గుర్తించారు. శిడిగమనల నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com