Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద.. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ముగ్గురు ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుపోయారు. ఇందులో ఓ బాలుడు కూడా ఉన్నాడు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Next Story