అరకొర వసతులతో తెరుచుకున్న పాఠశాలలు

అరకొర వసతులతో తెరుచుకున్న పాఠశాలలు

అరకుర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. నాడు నేడు పేరుతో ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో విఫలమైంది. తిరుపతి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొన్ని పాఠశాలలను మరమ్మతుల పేరుతో, కూల్చివేసినా ఇంతవరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం అధికారులు చేపట్టలేదు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, విద్యార్థులకు శాపంగా మారింది. ఆరు బయట చదువుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పాఠశాలలకు వచ్చిన జగనన్న విద్యా కానుక పంపిణీ కూడా తిరుపతి జిల్లాలో ఆలస్యమవుతుంది.

Next Story