By - Sathwik |26 Feb 2024 12:30 AM GMT
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి కారులో వస్తున్న ఆరుగురు యువకులు మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అతివేగంగా ముందుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com