By - Chitralekha |27 July 2023 11:24 AM GMT
నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో శ్రీరాంసాగర్కు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక ఇన్ ఫ్లో లక్షా 70వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 50వేల క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఓపెన్ చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com