By - Vijayanand |17 Jun 2023 8:49 AM GMT
అనంతపురంలో సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపారు. టవర్ క్లాక్ వద్ద టీవీ కూలర్లు, ఫ్యాన్లకు పూలహారాలు వేసి, పూజలు చేయించి ధర్నా నిర్వహించారు. జగన్ సర్కారుపై మండిపడిన సీపీఐ నేతలు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలు ఉక్కపోతలో ఫ్యాన్ వేసుకోకుండా కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంచి ఫ్యాన్, కూలర్లకు పని లేకుండా పోయిందని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com