AP: జగన్‌ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్

AP: జగన్‌ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్

జగన్‌ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పడకేశాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు అని వీటి కింద ఎన్నో నదులు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామన్నారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చని అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇక తన వల్లే ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించడం హాస్యాస్పదమన్నారు. ఇరిగేషన్ మంత్రి అరుపులు తప్పా ఏ పని చేయడని విమర్శించారు. ఇక కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు

Next Story