TDP-JANASENA: ప్రజా క్షేత్రంలోకి ముమ్మరంగా టీడీపీ-జనసేన

TDP-JANASENA: ప్రజా క్షేత్రంలోకి ముమ్మరంగా టీడీపీ-జనసేన

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదిరేందుకు, వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నేతలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎలమంచిలి నియోజవర్గ నేతలు, అనంతపురంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేతలు, విశాఖ భీమునిపట్నం తెలుగుదేశం కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


మరోవైపు తెలుగుదేశం, జనసేన నేతలు ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోను పలు నియోజకవర్గాల్లోని నేతలు ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతలతో కలిసి అత్తిలిలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వరరావు కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిలోని చిరువ్యాపారులకు కరపత్రాలను అందజేసి మేనిఫెస్టోను వివరించారు.

Next Story