వైసీపీ నేతలు ఇసుక తవ్వి తరలిస్తున్న లారీల వద్ద లోకేష్‌ సెల్ఫీ

వైసీపీ నేతలు ఇసుక తవ్వి తరలిస్తున్న లారీల వద్ద లోకేష్‌ సెల్ఫీ

బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియా ఆగడాలు ఉన్నాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసిపి నేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీల వద్ద లోకేష్‌ సెల్ఫీ దిగారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ... వైసిపి మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయని ఆరోపించారు. జగన్‌ పాలనలో రాజ్యంగం, చట్టాలకు విలువలేదు.. తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, టార్గెట్ పూర్తిచేయడమే అంటూ ధ్వజమెత్తారు.

Next Story