Gudivada: వరద బాధితులకు టీడీపీ నేత వెనిగండ్ల రాము పరామర్శ

Gudivada: వరద బాధితులకు టీడీపీ నేత వెనిగండ్ల రాము పరామర్శ

గుడివాడ నియోజకవర్గంలో వరద బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. నందివాడ మండలం వెన్ననపూడి ఎస్సీ కాలనీలో పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో జీవనం సాగిస్తున్న గ్రామస్తులను చూసి ఆయన చలించిపోయారు. గ్రామస్తులు దుస్థితిని ఎమ్మార్వోకు వివరించారు. వెనిగండ్ల రాము, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎమ్మార్వో భావన్నారాయణ పర్యటించి పరిశీలించారు. కాలనీ వాసులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు.

Next Story