ఆర్థిక శాఖకు మాజీ ఆర్థికమంత్రి యనమల లేఖ

ఆర్థిక శాఖకు మాజీ ఆర్థికమంత్రి యనమల లేఖ

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలు తెలపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌‌కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కాగ్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను ప్రశ్నించారు. కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story