Tirupati: చంద్రగిరిలో టీడీపీ నేతల ఆమరణ నిరాహార దీక్ష

Tirupati: చంద్రగిరిలో టీడీపీ నేతల ఆమరణ నిరాహార దీక్ష

తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు పెట్రోల్ క్యాన్లతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నాయకులు ప్రజల ప్రాణాలను తీస్తున్నారంటూ టీడీపీ నేతలు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. చంద్రగిరి నియోజకవర్గం రెడ్డివారిపల్లిలో ఈతకు వెళ్లిన కార్తీక్ అనే విద్యార్థి మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఇష్టానుసారం ఇసుకను తవ్వేయడం వల్లనే విద్యార్థి మృత్యువాత పడ్డారన్నారు. మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story