శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. పొందూరు మండలం సింగూరు ఇసుక రిచ్‌ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో కూన రవికుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఇసుక అక్రమాలను పరిశీలిస్తామంటూ ముందుకు వెళ్లిన కూనరవికుమార్ తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారని కూనరవికుమార్ ఆరోపించారు.

Next Story