విశాఖలో రెచ్చిపోతున్న భూదొంగలు

విశాఖలో రెచ్చిపోతున్న భూదొంగలు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూదొంగలు రెచ్చిపోతున్నారు. విలువైన భూములను మాయం చేస్తున్నారు. ఇప్పటికే 40 వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల భూదోపిడీపై చార్జిషీట్‌ పేరుతో టీడీపీ ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల భూదందాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటున్నారు.

Next Story