By - Chitralekha |28 Aug 2023 7:51 AM GMT
ఏపీ వ్యాప్తంగా అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. అక్రమ ఇసుక క్వారీలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినా... ఇసుక రవాణా యథేచ్చగా జరుగుతోందంటున్నారు టీడీపీ నేతలు. దీన్ని అడ్డుకునేందుకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక క్వారీల వద్ద ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం జువ్వలపాలెంలో మాజీ మంత్రి ఆనందబాబు ఆధ్వర్యంలో ఇసుక క్వారీల వద్ద ఆందోళన చేస్తున్నారు. అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com