చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆయనకు మద్దతుగా కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీలు చేశారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అండగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు 50వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కృష్ణయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు.
CBN అక్షరాలతో ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నిరాధారమైన కేసులు పెట్టి అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేయించారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే... గోరంట్ల మాధవ్కి ఇప్పటి వరకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కల్యాణదుర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com