By - Chitralekha |20 July 2023 10:49 AM GMT
విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా ఆధిపత్యపోరు రచ్చకెక్కింది. ఒకే కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వేర్వేరుగా హాజరవుతున్నారు. తాజాగా ఎస్.కోట మండలం మూలబొడ్డవర గ్రామంలో జరిగిన సురక్ష శిబిరానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విడివిడిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ వచ్చి వెళ్లిన తర్వాత అదే కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇద్దరి తీరుతో అధికారికి కార్యక్రమాలకు రావడానికి వైసీపీ నేతలు ఇష్టపడడం లేదు. దీంతో గ్రామస్థాయి సభలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com