Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి

Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి

ముంబయిలోఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన వరుస కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని స్థానిక డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. ఈ ఘటనలో మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం 6 కార్లు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story