తిరుపతి జిల్లాలో తాటికోన గిరిజన విద్యార్థుల ఆందోళన

తిరుపతి జిల్లాలో తాటికోన గిరిజన విద్యార్థుల ఆందోళన

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తాటికోన గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని నిరసన చేపట్టారు. జగన్ అంకుల్ రోడ్డు వేయించండి ప్లీజ్ అంటూ వేడుకున్నారు. తాటికోన నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాల ఉందని స్కూల్‌కు వెళ్లాలంటే మోకాళ్ల లోతు గుంతలు, దుమ్ము ధూళితో ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గత వారం ఆటో బోల్తా పడి తమ పిల్లలకు గాయాలయ్యాయని తల్లిదండ్రులు అన్నారు.

Next Story