Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

రాజస్థాన్‌లోని కోటాలోప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్‌లో జోధ్‌పూర్‌-భోపాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. రైల్వే సిబ్బంది ఆ మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. వీలైనంత తొందరగా రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని వెల్లడించారు. కాగా, ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను అధికారులు విడుదల చేశారు. ఈ సంఘటన బికనీర్‌లోని లాల్‌ఘర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియలేదు. రైల్వే అధికారులు రైలు మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. అంతకుముందు డిసెంబర్ 2023లో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది.

Next Story