By - Vijayanand |7 Aug 2023 9:09 AM GMT
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేటు వద్ద వీఆర్ఏలు నిరసన దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పేస్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పనిచేస్తూ మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. రికవరీ చేసిన డీఏలను తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com