By - Chitralekha |14 Aug 2023 10:26 AM GMT
తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సమావేశం జరిగింది. అడిషనల్ PCCFO శాంతిప్రియ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జంతుల సమాచారం కోసం కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. నడకదారికి 100మీటర్ల దూరంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని..15ఏళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారి లక్షితను చంపి తిన్న చిరుత.. ఇవాళ పట్టుబడిన చిరుత ఒక్కటేనా కాదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. ఒక వేళ పట్టుబడిన చిరుతే పాపను చంపి ఉంటే జూలోనే ఉంచుతామని తెలిపారు శాంతి ప్రియ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com