By - Chitralekha |12 Aug 2023 8:15 AM GMT
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఇద్దరు మహిళల అదృశ్యం సంచలనం రేపుతోంది. ఆస్పత్రికి వెళ్తున్నానని రాళ్లగూడలోని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వడ్ల మంజుల అదృశ్యమైంది. శంషాబాద్ మండలం మదనపల్లి నుండి డ్యూటీకని బయలుదేరి కృష్ణమోని అఖిల అదృశ్యమైంది. దీంతో.. ఇద్దరు మహిళల బంధువులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్లోని శ్రీనివాస ఎన్క్లేవ్లో దారుణ హత్యకు గురైన మహిళ వడ్ల మంజుల అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com