By - Chitralekha |20 July 2023 10:52 AM GMT
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా ఆత్మగౌరవ దినోత్సవం రోజున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహిళా ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు. దీక్షకు సంబంధించి పోస్టర్ను తెలుగు మహిళలతో కలిసి విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మహిళా ఆత్మగౌరవ దీక్షకు అన్ని పార్టీల నాయకులను, మహిళలను ఆహ్వానిస్తున్నట్లు అనిత తెలిపారు. దీక్ష తర్వాత మహిళా ఆత్మగౌర పోరాట కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. మహిళలపై ఎన్నడూ లేని విధంగా దారుణాలు జరుగుతుంటే డీజీపీ ప్రశాంతంగా ఉందని స్టేట్మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com