By - Bhoopathi |18 Jun 2023 10:30 AM GMT
యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఇకపై చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. అండుకొర్రలు, అరికెలు, సామలు, సామలు, బెల్లంతో చిరుధాన్యాల లడ్డూలను తయారు చేసేందుకు అధికారులు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశారు. వివిధ సైజుల్లో తయారు చేసిన లడ్డూ నమూనాలను నిపుణుల కమిటీ పరిశీలనకు పంపారు దేవాదాయశాఖ అధికారులు. కమిటీ ఆమోదంతో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదాల పంపిణీకి మార్గం సుగమం అయింది. ఒక్కో లడ్డూ ధరను 40 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి చిరుధాన్యాల లడ్డూలు భక్తులకు అందుబాటులోకి రానున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com