పల్నాడులో దారుణం; పాతకక్షలతో బాలికపై వైసీపీ నేత దాడి

పల్నాడులో దారుణం; పాతకక్షలతో బాలికపై వైసీపీ నేత దాడి

పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధి దారుణానికి తెగబడ్డాడు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ ఉపసర్పంచ్ నంబూరి కృష్ణమూర్తి ఓ మైనర్ బాలికపై దాడి చేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో పలువురితో కలిసి దారుణంగా హింసించారు. జుట్టుపట్టుకుని రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాడు. బాలికను కర్రతో బలంగా కొట్టి, గుండెలపై తన్నడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story