By - Sathwik |4 Nov 2023 5:45 AM GMT
మాచర్లలో వైసీపీ సామాజిక సాధికారయాత్రలో మహిళలు మందేసి చిందేశారు. ఓ పక్క సామాజిక సాధికార యాత్ర సభ జరుగుతుంటే చివరలో కొందరు మహిళలు మందు సీసాలతో డ్యాన్స్ చేశారు. మద్యం సీసాలు చేతిలో పట్టుకుని తాగుతూ డ్యాన్స్ చేస్తూ హల్చల్ చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్న సభలో ఇలా చేయడం విశేషం. ఈ సభ కోసం ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి, బస్సులను కార్యకర్తలు, ప్రజలను తరలించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com