Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇండియన్ అమ్మాయి చనిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదం జరిగింది. అర్షియా జోషి (24) అనే భారతీయ యువతి మృతి చెందింది. ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ తెలిపింది. మార్చి 21న పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు, ప్రొఫెషనల్ అర్షియా జోషి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలంటూ స్పందించింది.

ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులర్, పాస్పోర్ట్, వీసా (సీపీవీ) విభాగాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అర్షియా జోషి గత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే సంక్షోభ పరిస్థితుల్లో విదేశాల్లో నివసిస్తున్న ప్రజలకు సహాయం చేసే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ టీమ్ ఎయిడ్ జోషి పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆమె కుటుంబానికి పంపడానికి సహాయం చేస్తోంది.

Next Story