సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి జారిపడ్డ యువకుడు

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి జారిపడ్డ యువకుడు

మహారాష్ట్రలోని అజంతా గుహల వద్ద సెల్ఫీ కోసం పోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్‌ కి చెందిన గోపాల్ తన స్నేహితులతో కలిసి అజంతా గుహలకు వెళ్లాడు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి 2వేల అడుగుల లోతైన గొయ్యిలో పడిపోయాడు.వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈత రావడంతో అతడు ఓ రాయిని పట్టుకుని ఉండగా.. పోలీసులు, అధికారులు కలిసి అతడిని కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story